‘మనసంతా నువ్వే’ @19 ఏళ్ళు, ఎమోషనల్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 01:10 PM

‘మనసంతా నువ్వే’ @19 ఏళ్ళు, ఎమోషనల్ ట్వీట్ చేసిన ప్రొడ్యూసర్

ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఉదయ్‌కిరణ్, రీమాసేన్ జంటగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై(అక్టోబర్ 19, 2001) 19ఏళ్లు పూర్తయింది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో రికార్డులు తిరగరాసింది. అద్భుతమైన కథ, కధనంతో పాటు నటీనటుల అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను తిరగరాసి నిర్మాతగా ఎమ్మెస్ రాజు‌ను మరింత ఉన్నత స్థితికి చేర్చింది. ‘మనసంతా నువ్వే’ 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ చిత్ర విశేషాలను తెలుపుతూ ట్విటర్‌ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్ని ఇబ్బందులు పడిందీ, ఈ సినిమా విడుదల తర్వాత తన కష్టాలన్నీ ఎలా తీరిపోయాయి వంటి ఎమోషనల్‌ విషయాలను ఈ లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ ...








Untitled Document
Advertisements