ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఉదయ్కిరణ్, రీమాసేన్ జంటగా తెరకెక్కిన ‘మనసంతా నువ్వే’ విడుదలై(అక్టోబర్ 19, 2001) 19ఏళ్లు పూర్తయింది. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో రికార్డులు తిరగరాసింది. అద్భుతమైన కథ, కధనంతో పాటు నటీనటుల అద్భుతమైన పర్ఫార్మెన్స్ సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లాయి. అందుకే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నిర్మాతగా ఎమ్మెస్ రాజును మరింత ఉన్నత స్థితికి చేర్చింది. ‘మనసంతా నువ్వే’ 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత ఎమ్మెస్ రాజు ఆ చిత్ర విశేషాలను తెలుపుతూ ట్విటర్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్ని ఇబ్బందులు పడిందీ, ఈ సినిమా విడుదల తర్వాత తన కష్టాలన్నీ ఎలా తీరిపోయాయి వంటి ఎమోషనల్ విషయాలను ఈ లేఖలో పేర్కొన్నారు. ఆయన రాసిన లేఖ ...
#ManasanthaNuvve నా సినిమాల్లో చాలా ప్రత్యేకమైనది.సూపర్ టీమ్ వర్క్ తో బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగాం. ఈ విజయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ .ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగా ఉంది. @vn_aditya @sirivennela1955 @GkParuchuri @rppatnaik @VeeruPotla1 #Reemasen pic.twitter.com/dPm96DCq9x
mdash; MS Raju (@MSRajuOfficial) October 19, 2020