తెలంగాణకు రూ.15 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన ఢిల్లీ

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:03 PM

తెలంగాణకు రూ.15 కోట్ల ఆర్ధిక సాయం ప్రకటించిన ఢిల్లీ

హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వందకు పైగా పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగర ప్రజలు వరద నీటిలో చిక్కుకొని అతలాకుతలమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు విడుదల చేశారు. ఇక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణకు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు విరాళం ప్రకటించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సాయం ప్రకటించారు. తమ రాష్ట్రం తరుఫున రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. కష్ట సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ పూర్తిగా అండగా ఉంటుందని కేజ్రీవాల్ వెల్లడించారు. రూ.15 కోట్ల సాయం ప్రకటించారు. దీంతో కేజ్రీవాల్ కు తెలంగాణ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కేజ్రీవాల్ కు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉదారత చాటుకుని తెలంగాణ రాాష్ట్రానికి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సినీ సెలబ్రిటీలు సైతం తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలు ప్రకటించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్ మహేష్ బాబు కోటి రూపాయల సాయం అందించారు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రూ. 50 లక్షల విరాళం అందించేందుకు సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. అనేక మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితుల్ని ఆదుకునేందుకు భారీగా విరాళాలు అందిస్తున్నారు.





Untitled Document
Advertisements