హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమయ్యింది. నాళాలు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాల్లో అనేక కాలనీలు నీట మునిగి ఇళ్ళలోకి నీరు చేరింది. అయితే వరద భాదితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను చేపడుతుంది. అయితే వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు కూడా చాలా మంది ముందుకొస్తున్నారు.
ఇప్పటికే మెగస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి, ప్రభాస్ కోటి, బాలకృష్ణ 50 లక్షలు, నాగార్జున 50 లక్షలు, ఎన్టీఆర్ 50 లక్షలు, రామ్ పోతినేని 25 లక్షలు, విజయ్ దేవరకొండ 10 లక్షలు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి చెరో 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనవంతు సాయంగా తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు జనసైనికులు, అభిమానులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.