ఏపీలో కరోనా కేసుల సంఖ్య???

     Written by : smtv Desk | Wed, Oct 21, 2020, 01:32 PM

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే గడిచిన 24 గంటలలో 69,095 శాంపిల్స్‌ని పరీక్షించగా కేవలం 3,503 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 28 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కి చేరింది.

అయితే ఇందులో ప్రస్తుతం 33,396 మంది చికిత్స పొందుతుండగా 7,49,676 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక నేడు కరోనా నుంచి కోలుకుని 5,144 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,481 కి చేరింది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71,96,628 శాంపిల్స్ పరీక్షించారు.





Untitled Document
Advertisements