ఏటీఎం కొత్త రూల్స్...రేపటి నుంచి అమలులోకి

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 08:11 AM

ఏటీఎం కొత్త రూల్స్...రేపటి నుంచి అమలులోకి

ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం రూల్స్‌ను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI దారిలోనే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా పయనిస్తోంది.

పీఎన్‌బీ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్‌ను సవరిస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. దీంతో ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే వారు కచ్చితంగా వారి మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.

దీన్ని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. లేదంటే రావు. అయితే ఇలా ఓటీపీ ఆధారిత క్యాష్ విత్‌డ్రా రూల్స్ కేవలం రూ.10 వేలకు పైన లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
పీఎన్‌బీ ట్వీట్ ప్రకారం.. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు రూ.10,000కు పైన ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రా చేసుకునే వారికి మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి. అయితే ఇక్కడ పీఎన్‌బీ కస్టమర్లు వారి డెబిట్ కార్డు ద్వారా ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తే మాత్రం ఈ రూల్స్ వర్తించవు.





Untitled Document
Advertisements