గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 08:44 AM

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్

మోదీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాను విక్రయిస్తోంది. ఇందులో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌‌ను ప్రైవేట్ సంస్థల పరం చేయడానికి తీవ్రంగానే శ్రమిస్తోంది. ఇక్కడ చాలా మందికి చాలా సందేహాలు తలెత్తాయి. వీరిలో గ్యాస్ సిలిండర్ వినియోగదారులు కూడా ఉన్నారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్.. భారత్ గ్యాస్ పేరుతో కస్టమర్లకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బీపీసీఎల్‌ను ప్రైవేట్ సంస్థకు విక్రయిస్తే.. అప్పుడు వీరిపైన నేరుగా ప్రభావం పడే అవకాశముందని చాలా మంది భావిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌‌లో ప్రైవేట్ కంపెనీలకు వాటాలు విక్రయించినా కూడా భారత్ గ్యాస్ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడబోదని స్పష్టం చేసింది. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రస్తుతం ఎలాగైతే సబ్సిడ లభిస్తోందో వాటాల విక్రయం తర్వాత కూడా సబ్సిడీ లభిస్తుందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
అంతేకాకుండా భారత్ గ్యాస్ వినియోగదారలను ఇండేన్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వంటి వాటికి కూడా బదిలీ చేసే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌లో తనకున్న 53 శాతం వాటాను ప్రైవేట్ కంపెనీల విక్రయించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. బీపీసీఎల్‌లో ప్రైవేట్ కంపెనీలు వాటాలు కొనుగోలు చేసినా కూడా గ్యా్స్ సిలిండర్ వినియోగదారులకు వచ్చే నష్టం ఏమీ లేదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements