డీజీపీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 10:38 AM

డీజీపీకి వార్నింగ్ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

జిహెచ్ఎంసి ఎలక్షన్ లు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రభుత్వం అక్రమంగా గెలవాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం, డబ్బులు పంచడం చేస్తుందన్నారు రాష్ట్రఎన్నికల కమిషన్, రాష్ట్ర డిజిపి ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలాగా మారారని ఆరోపించారు. రాష్ట్ర డిజిపిని వెంటనే బదిలీ చేయాలన్నారు. డీజీపీని పోలీస్ అధికారిగా పనిచేయాలని చెప్పామన్నారు. టిఆర్ఎస్ ఏజెంట్ గా పని చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందన్నారు. దానికి డీజీపీయే బలైపోతరాన్నారు బండి సంజయ్.

డీజీపీ పోలీస్ అధికారియా లేక టీఆర్ఎస్ పార్టీ ఏజెంటా అని మండిపడ్డారు. ..పోస్టింగ్ ల కోసం డ్యూటీ చేస్తున్నారా..? అంటూ బండి నిలదీశారు. బీజేపీ వారిని కొట్టండి..trs వారికి సహకరించండి అని కిందిస్థాయి అధికారులకు సూచించాారా అని డీజీపీని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలను కొట్టకండి అని చెప్తే అతని మీద దాడి చేసి పోలీస్ స్టేషన్లు తిప్పి తిప్పి మారుస్తారా.. అంటూ ప్రశ్నించారు. ‘నీ డీజీపీ ఆఫీస్ కి వస్తాను బిడ్డ.. కాని ఆ అవకాశం నాకు ఇవ్వకు..నీ ఆఫీస్ కి వస్తే తెలంగాణలో డ్యూటీ చేయలేవు జాగ్రత గా ఉండు..’అంటూ బండి సంజయ్ డీజీపీని హెచ్చరించారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్ము మీు తెలియదన్నారు.మా సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు. దాడి చేస్తే పడడానికి మేము టిఆర్ఎస్ కార్యకర్తలు కాదన్నారు. ముఖ్యమంత్రి పైసలు పెట్టి గెలవాలని చూస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి చుక్కలు చూపిస్తానని ఛాలెంజ్ చేశారు బండి. =అవినీతి సొమ్ము అంతా కూడా కక్కిస్తాన్నారు. రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేలు, మంత్రులతో హైదరాబాద్ లో డబ్బులు పంచిపెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు డబ్బులు తీసుకుంటురు కానీ కేసీఆర్‌కు మాత్రం ఓటు వేయరననారు. భాగ్యనగర్ ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు బండి సంజయ్. ఒక్కొక్క లాటి దెబ్బకు తప్పకుండా బదులు తీర్చుకుంటామన్నారు.





Untitled Document
Advertisements