రైతుల ముందే వీఆర్వో ని నిలదీసిన ఎమ్మెల్యే

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 11:57 AM

రైతుల ముందే వీఆర్వో ని నిలదీసిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఓ వీఆర్వోపై మండిపడ్డారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు రావడంతో వీఆర్వోను మందలించారు. రైతుల ముందే ఆయన్ను పిలిచి తిట్ల వర్షం కురిపించారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు.. ఎక్కడికి వెళ్లినా అందరూ ఫిర్యాదు చేస్తున్నారని.. అక్రమాలకు పాల్పడుతూ.. లంచాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

ప్రజా ప్రతినిధులుగా వీర్వోపై రైతులు, స్థానికులు ఆగ్రహంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన్ను కొట్టినా ఆశ్చర్యం లేదని.. వెంటనే సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టం జరిగిందని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. వీఆర్వో నుంచి సరైన సమాధానం రాలేదు. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కానీ వీర్వోకు కనీసం అవగాహన లేదని మండిపడ్డారు. రైతుల సమస్యల్ని పరిష్కరించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది.





Untitled Document
Advertisements