రూ.2 లక్షలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!!

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 12:06 PM

రూ.2 లక్షలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!!

దేశంలో పన్ను ఎగవేతలను తగ్గించడానికి ఆదాయపు పన్ను చట్టంలో ఒక సెక్షన్ ఉంది. ఇది సెక్షన్ 269ఎస్‌టీ. ఈ ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ కారణంగా ఎవరైనాసరే ఒక రోజులో రూ.2 లక్షలు లేదంటే ఆపైన మొత్తంలో డబ్బులను నగదు రూపంలో తీసుకోకూడదు. అది ఒకేసారి కావొచ్చు.. లేదంటే విడతల వారీగా కూడా కావొచ్చు. ఎలాగైనాసే రూ.2 లక్షలకు పైన తీసుకోకూడదు.

ఉదాహరణకు మీకు ఎవరైనా వారి అప్పు తీర్చుకోవడానికి మీకు ఒకేసారి రూ.2 లక్షలకు పైన నగదు ఇస్తే.. ఆ డబ్బులు మీరు తీసుకుంటే.. అప్పుడు మీకు ఏకంగా 100 శాతం డబ్బును పెనాల్టీ రూపంలో చెల్లించుకోవలసి రావొచ్చు. అందువల్ల మీరు ఎవరి వద్ద నుంచైనా క్యాష్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అకౌంట్ పేయీ చెక్ లేదంటే అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాఫ్ట్ లేదంటే బ్యాంక్ అకౌంట్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్) ద్వారా రూ.2 లక్షలు లేదా ఆపైన విలువ గల ట్రాన్సాక్షన్లకు అనుమతి ఉంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, యూపీఐ, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, భీమ్, ఆధార్ పే వంటి ద్వారా జరిపే పేమెంట్లు కూడా బ్యాంక్ అకౌంట్ ఈసీఎస్ కిందనే పరిగణిస్తారు.

అంటే పైన పేర్కొన్న మార్గాల్లో ఏ విధంగా అయితే రూ.2 లక్షలు లేదా ఆపైన డబ్బులు పొందొచ్చు. ఇలా కాకుండా క్యాష్ రూపంలో డబ్బులు తీసుకుంటే మాత్రం పెనాల్టీలు భరించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే రూ.2 లక్షలు సరైన దారిలోనే వచ్చాయని కచ్చితమైన కారణం తెలియజేస్తే.. అప్పుడు ఎలాంటి పెనాల్టీ ఉండదు.





Untitled Document
Advertisements