బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు...డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 12:14 PM

బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు...డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్

బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందబోతోంది. డిజిటల్ పేమెంట్స్‌ను పెంచాలనే లక్ష్యంతో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. దీంతో బ్యాంక్ కస్టమర్లకు బెనిఫిట్ కలుగనుంది.

రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ RTGS సేవలను రోజంతా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌బీఐ గతంలోనే నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం రేపటి నుంచి అమలులోకి వస్తుంది. అంటే రేపటి నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు బ్యాంక్ కస్టమర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ రూల్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉన్నాయి. పనిదినాల్లో మాత్రమే ఈ సేవలు పొందొచ్చు. కనీసం రూ.2 లక్షల మొత్తాన్ని ఆర్‌టీజీఎస్ సిస్టమ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా బ్యాంకులు రూ.10 లక్షల వరకు లిమిట్ పెట్టుకుంటాయి.

ఇకపోతే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ వంటి వాటి ద్వారా డబ్బులు ఎలాంటి చార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లో పంపించుకోవచ్చు. ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో బ్యాంక్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బ్యాంకుకు వెళ్లి మీరు డబ్బులు పంపించాలని భావిస్తే మాత్రం చార్జీలు చెల్లించుకోవాలి.





Untitled Document
Advertisements