500 మద్యం బాటిళ్లను పగలగొట్టిన మహిళ... ఎందుకో తెలుసా?

     Written by : smtv Desk | Mon, Nov 30, 2020, 02:56 PM

500 మద్యం బాటిళ్లను పగలగొట్టిన మహిళ... ఎందుకో తెలుసా?

యూకేలోని ఓ సూపర్ మార్కెట్లో ఓ మహిళ లిక్కర్ బాటిళ్లను ధ్వంసం చేసింది. అంతా చూస్తుండగానే ఆమె బాటిళ్లను నేలకేసి కొడుతూ.. భయాందోళనలు సృష్టించింది. చిత్రం ఏమిటంటే.. ఆమె అలా ఖరీదైన బాటిళ్లను ధ్వంసం చేస్తున్నా.. ఆ మార్కెట్లోని సిబ్బందిగానీ, మేనేజర్‌గానీ ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పోలీసులకు ఫోన్ చేసి చేతులు దులుపుకున్నారు.

హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ షాపింగ్ చేయకుండా ఓ ర్యాక్‌లో ఉన్న బీర్, వైన్ తదితర మద్యం సీసాలను ఒక్కొక్కటీ పగలగొడుతూ హడలగొట్టింది. దీంతో షాకైన కస్టమర్లు సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోలేదు. అయితే, ఓ కస్టమర్ ఆమెను ఆపేందుకు ప్రయత్నించగా.. ఆమె అతడి కాళ్ల మీదకు బాటిల్ విసిరింది. దీంతో మిగతా కస్టమర్లు ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు.

‘‘1,30,000 డాలర్లు విలువ చేసే మద్యం బాటిళ్లను పగలగొట్టింది. సుమారు అరగంట సేపు ఆమె వాటిని పగలగొడుతూనే ఉంది. కానీ, పోలీసులు ఎక్కడా? వెంటనే స్పందించలేదు ఎందుకు? మేనేజర్ ఆమె జుట్టుపట్టుకుని అక్కడ నుంచి ఎందుకు లాక్కెళ్లలేదు?’’ అని ప్రశ్నిస్తూ.. చార్లెస్ ఆడమ్స్ అనే వ్యక్తి పోస్టు చేసిన ట్విట్టర్‌‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ సమయంలో సుమారు 50 మందికి పైగా కస్టమర్లు ఉన్నారు. పోలీసులు ఆమెను పట్టుకోడానికి ప్రయత్నించే సమయంలో పగిలిన బాటిల్ వల్ల ఆమె కుడిచేతికి గాయమైంది. దీంతో పోలీసులు ఆమెను ముందుగా హాస్పిటల్‌కు తరలించి, చికిత్స తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఆమె అలా చేయడానికి గల కారణం తెలియరాలేదు.





Untitled Document
Advertisements