సైబరాబాద్... ఏడు రోజుల్లో 3571 డ్రంకన్ డ్రైవ్ కేసులు

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 02:12 PM

సైబరాబాద్... ఏడు రోజుల్లో 3571 డ్రంకన్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసుకోవడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వారం రోజులుగా సైబరాబాద్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ టెస్టులను ముమ్మరం చేశారు. మామాలు రోజుల్లో కంటే వీకెండ్‌లో ఎక్కువ మంది మందుబాబు పట్టుబడుతుండటంతో పోలీసులు దానిపై ఫోకస్ చేస్తున్నారు.

ఆదివారం రాత్రి సైబరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 346 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలు సీజ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3751 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం తాగి పట్టుబడే వారిలో ఎక్కువ మంది 26-45ఏళ్ల మధ్య వయసున్న వారేనని పోలీసులు చెబుతున్నారు. నగరంలో డ్రంకన్ డ్రైవ్‌ను పూర్తిగా అరికట్టే వరకు తనిఖీలు కొనసాగుతూనే ఉంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.





Untitled Document
Advertisements