మహేష్ కి వదినగా రేణు దేశాయ్?!

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 04:03 PM

మహేష్ కి వదినగా రేణు దేశాయ్?!

గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మహేష్ సిస్టర్ రోల్‌లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య

రేణు దేశాయ్ పోషించనుందని విన్నాం. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆమె మహేష్ సిస్టర్‌గా కాదు వదినగా నటిస్తోందని తెలుస్తోంది. ఈ రోల్ సినిమాలో చాలా కీలకం అంటున్నారు.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేశారట డైరెక్టర్ పరశురామ్. మహేష్ వ్యాపారవేత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ సోషల్ మెసేజ్ ఇవ్వనుందని టాక్. అలాగే కామెడీకి పెద్ద పీట వేస్తూ హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్‌గా తీర్చిదిద్దారట డైరెక్టర్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా కీలకపాత్రలో నటించనుందనే లేటెస్ట్ అప్‌డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ఇక ఈ 'సర్కారు వారి పాట' మూవీలో మహేష్ బాబు హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం పంచుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. మహేష్ కెరీర్‌లో 27వ సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది. ఎస్.ఎస్. థమన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆసక్తి రేకెత్తించాయి. దీంతో ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.





Untitled Document
Advertisements