పంజాగుట్టలో వ్యక్తి హల్‌చల్

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 05:19 PM

పంజాగుట్టలో వ్యక్తి హల్‌చల్

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ప్రాంతంలో సోమవారం మతి స్థిమితం సరిగ్గా లేని వ్యక్తి హంగామా సృష్టించాడు. ఆస్పత్రి నుంచి పారిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీది నుంచి కిందికి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని వెంబడించారు. దీంతో అతడు తప్పించుకుని పారిపోతుండగా పోలీసులు ఆర్టీసీ బస్సెక్కి రెస్క్యూ చేసి పట్టుకున్నారు. ఈ ఘటన కారణంగా పంజాగుట్ట ఫ్లైఓవర్ ప్రాంతంలో కాసేపు అలజడి కొనసాగించింది.




అయితే పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆ సైకోను ప్రాణాలతో పట్టుకోగలిగారు. అతడిని స్టేషన్‌కు తరలించి మంచినీళ్లు తాగించి వివరాలు ఆరా తీసేందుకు యత్నించారు. ఈలోగా బంధువులు అక్కడికి చేరుకోవడంతో ఆ వ్యక్తికి నచ్చజెప్పి పంపించారు. అక్కడ ఏం జరుగుతుందో తెలీక వాహనదారులు కంగారు పడ్డారు. ఈ ఘటనతో పంజాగుట్ట పరిధిలో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అతడి పేరు రాజు అని, కొద్దిరోజులుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుండటంతో నిమ్స్‌లో జాయిన్ చేసేందుకు వచ్చాయని బంధువులు చెబుతున్నారు. తెల్లపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్ దగ్గర రాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. రామచంద్రాపురం నుంచి నిమ్స్‌కు తీసుకొస్తున్న సమయంలో తమను చాలా ఇబ్బంది పెట్టాడని, పంజాగుట్టకు వచ్చాక తప్పించుకుని నానా హంగామా సృష్టించాడని అతడి బావ మీడియాకు తెలిపాడు.





Untitled Document
Advertisements