దేశంలో 38కి పెరిగిన కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 06:51 PM

దేశంలో 38కి పెరిగిన  కొత్త రకం వైరస్ కేసుల సంఖ్య

దేశంలో కరోనా కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌కు చెందిన కేసుల సంఖ్య 38కి పెరిగింది. యూకే రకానికి చెందిన కేసులు సోమవారం (జనవరి 4) మరో 9 నమోదయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో బాధిత వ్యక్తులను సింగిల్ రూం ఐసోలేషన్‌లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో 10, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)లో 5, ఢిల్లీలోని ఐసీఐబీలో 11, ఎన్‌సీడీసీలో 8, కోల్‌కతాలోని NCBG కళ్యాణి ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.

పాజిటివ్‌ వచ్చిన వారి కాంటాక్టులను ట్రేస్ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వారితో కలిసి ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబసభ్యులను గుర్తించి వారికి కూడా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది.

మరోవైపు.. దేశంలో సాధారణ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో నమోదైన తక్కువ కేసులు ఇవే కావడం విశేషం. ఇలాంటి తరుణంలో యూకే వైరస్ స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది.





Untitled Document
Advertisements