అమ్మ చనిపోయిందని తెలుసుకోలేని స్థితిలో కొడుకు...మృతదేహంతోనే ఐదు రోజులు

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 11:19 AM

అమ్మ చనిపోయిందని తెలుసుకోలేని స్థితిలో కొడుకు...మృతదేహంతోనే ఐదు రోజులు

అమ్మ చనిపోయిందని తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి.. తన తల్లి మృతదేహంతో ఐదు రోజులు ఇంట్లో గడిపాడు. దుర్వాసన వస్తుండటంతో అంత్యక్రియలు జరిపేందుకు వెళ్లిన స్థానికులను అడ్డుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి.. చివరకు మున్సిపల్ సిబ్బంది సాయంతో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. మతి స్థిమితం లేకపోవడంతోనే.. అతడు ఇలా చేశాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మంజులా దేవి (79) తన కుమారుడు రవీంద్ర ఫణితో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు. రవీంద్రకు మతిస్థిమితం సరిగా ఉండదు. అనారోగ్యం బారిన పడిన మంజులా.. ఇటీవల చనిపోయారు. ఆమె మరణించిన విషయం తెలుసుకునే పరిస్థితిలో లేని రవీంద్ర... తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు గడిపాడు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు.. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా రవీంద్ర అడ్డుకున్నాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను సైతం రవీంద్ర అడ్డుకోవడంతో.. మున్సిపల్ సిబ్బంది సాయంతో డెడ్ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మతిస్థిమితం లేని రవీంద్ర.. గతంలో తన సోదరి మరణించిన సమయంలోనూ ఇలాగే ప్రవర్తించాడని స్థానికులు చెప్పారు.





Untitled Document
Advertisements