ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:02 PM

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్

శ్రీలంకతో టెస్టు సిరీస్ ముంగిట ఇంగ్లాండ్ టీమ్‌లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాలే వేదికగా జనవరి 14 నుంచి వరుసగా రెండు టెస్టుల సిరీస్‌ని ఆడేందుకు శ్రీలంకకి వెళ్లిన ఇంగ్లాండ్ టీమ్‌కి తాజాగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ప్రయాణంలో అతనికి క్లోజ్‌గా ఉన్న ఫాస్ట్ బౌలర్ క్రిస్‌వోక్స్‌‌‌ని కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.
టెస్టు సిరీస్‌లో ఆడేందుకు శ్రీలంకలోని హంబన్‌తోట విమానాశ్రయానికి ఇంగ్లాండ్ టీమ్ తాజాగా చేరుకోగా.. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొయిన్ అలీకి పాజిటివ్ రావడంతో అతడ్ని వెంటనే 10 రోజుల క్వారంటైన్‌కి తరలించారు. అలానే అతనితో క్లోజ్‌గా ఉన్న క్రిస్‌వోక్స్‌ని మరోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉండాలని ఆదేశించారు.

గాలె వేదికగానే శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు రెండు టెస్టులనూ ఆడనుండగా.. జనవరి 26తో ఈ సిరీస్ ముగియనుంది. ఆ వెంటనే భారత్‌కి రానున్న ఇంగ్లాండ్ టీమ్.. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఆడనుంది.





Untitled Document
Advertisements