ప్రియురాలికి రూ. 15 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 12:10 PM

ప్రియురాలికి రూ. 15 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

భోపాల్ లో ఓ వింత ఘటన జరిగింది. తన భర్తను రూ. 15 కోట్లకు అతడ్ని ప్రేమించిన ప్రియురాలికి ఓ భార్య అమ్మేసింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే, భోపాల్ ఫ్యామిలీ కోర్టులో ఓ బాలిక ఫిర్యాదు చేసింది. తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడని కోర్టుకు విన్నవించింది. తండ్రి వివాహేతర సంబంధంతో తరచూ తల్లితో గొడవ పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. వారిద్దరి గొడవలతో తనకు, తన చెల్లెలికి చదువు పాడవుతుందని కోర్టకు విన్నవించింది. దీంతో బాలిక తల్లిదండ్రులను కౌన్సిలింగ్ కు పిలిపించగా, అతని వివాహేతర బంధం నిజమేనని తేలింది. అయితే భర్త ప్రియురాలితోనే ఉంటానని కోర్టుకు చెప్పాడు.

అంతేకాకుండా భార్యకు విడాకులు కూడా ఇస్తానన్నాడు. అయితే భర్తకు విడాకులు ఇచ్చేందుకు తొలుత అంగీకరించని భార్య, చివరకు తన బిడ్డల భవిష్యత్తు కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇల్లు, పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని వకోరగా, అందుకు భర్త ప్రియురాలు అంగీకరించింది. తన భర్త ప్రవర్తన నచ్చలేదని, బిడ్డల కోసమే విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని ఆమె తెలిపింది. ఈ మేరకు రూ. 15 కోట్లు ఇచ్చేందుకు ఇద్దరి మధ్య డీల్ కుదిరింది.





Untitled Document
Advertisements