కేంద్ర ప్రభుత్వంపు స్కీమ్...ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదన

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 02:33 PM

కేంద్ర ప్రభుత్వంపు స్కీమ్...ప్రతి నెలా రూ.లక్షల్లో సంపాదన

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల సంక్షేమం కోసం పలు రకాల స్కీమ్స్ అందిస్తున్నాయి. రాష్ట్రం ప్రాతిపదికన స్కీమ్స్ కూడా మారిపోతుంటాయి. అయితే ఇక్కడ ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అందించే స్కీమ్ ద్వారా ఒక వ్యక్తి రూ.లక్షలు సంపాదిస్తున్నాడు.

యోగి ప్రభుత్వం అందించే రోజ్‌గర్ యోజన స్కీమ్ ప్రోత్సాహంతో లక్నో‌కు చెందిన అశ్విని ద్వివేది అనే వ్యక్తి 2018 నుంచి పుట్టగొడుగులు సాగు చేస్తున్నాడు. రెండేళ్ల నుంచి 8 రకాల పుట్టగొడుగుల వెరైటీలను పెంచుతున్నారు. నెలకు 7 క్వింటాళ్ల పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు. నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నాడు.

అశ్విని ద్వివేది పుట్టగొడుగులు పెంపకానికి ముందు 2017లో ట్రైనింగ్ తీసుకున్నాడు. తర్వాత పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు పలు రకాల పుట్టగొడుగులు పెంచుతున్నారు. అంతేకాకుండా రైతులు, యువత, మహిళలకు ఉచితంగానే ట్రైనింగ్ అందిస్తున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రాఫిట్స్ ఎలా పొందాలో నేర్పిస్తామని పేర్కొన్నారు.

మీరు కూడా ఈయన లాగా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాలని భావిస్తే.. ముందుగా ట్రైనింగ్ తీసుకోండి. తర్వాత పుట్టగొడుగులను పెంచడాన్ని ప్రారంభించండి. అంతేకాకుండా ఇప్పుడు పుట్టగొడుగులతో చేసిన పలు ప్రొడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నామని ద్వివేది తెలిపారు.





Untitled Document
Advertisements