రాజమండ్రి నుంచి గాంధీజీ వరకు...రాష్ట్రపతులు వాడే రత్నం పెన్నులు

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 04:19 PM

రాజమండ్రి నుంచి గాంధీజీ వరకు...రాష్ట్రపతులు వాడే రత్నం పెన్నులు

రాజమండ్రి అనగానే గుర్తొచ్చే వాటిలో రత్నం పెన్నులు ఒకటి. స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న గాంధీ మహాత్ముడి పిలుపు మేరకు పూర్తి స్వదేశీ తయారీగా కోసూరి రత్నం ‘రత్నం పెన్ను’లను రూపొందించారు. ఈ పెన్నును చూసిన వెంటనే విదేశీ తయారీ కావొచ్చని గాంధీ అనుమానించారు. కానీ అది పూర్తిగా స్వదేశీ తయారీనే అని నిర్ధారించుకున్నాక మాత్రం గాంధీజీ మెచ్చుకున్నారు. మీ పెన్నును వాడుతున్నానంటూ.. 1935లో స్వయంగా మహాత్ముడు కోసూరి రత్నంకు లేఖ రాశారు.

1931లో రాజమండ్రిలో జస్టిస్ కృష్ణమాచారి సబ్‌ జడ్జిగా పని చేసేవారు. ఓ సందర్భంలో ఆయన వాడే జర్మనీ పెన్ను పాళీ విరిగిపోయింది. ఓ రోజంతా కష్టపడిన రత్నం.. దాన్ని కొత్త పాళీలా తయారు చేసి కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నం గారిని మెచ్చుకున్నారు. వెంటనే పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి చేశారు.

రత్నం రూపొందించిన పెన్ను మెచ్చుకుంటూ గాంధీ లేఖ రాయడంతో.. స్వదేశీ పెన్నుగా ‘రత్నం పెన్ను’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ పెన్నుల కోసం నేతలు ఎగబడ్డారు. ఈ పెన్నుల పాళీల తయారీలో బంగారం, వెండిని సైతం ఉపయోగించడం విశేషం. కేవలం గ్రామున్నర బరువున్న అతి చిన్న పెన్నులను సైతం రత్నం సంస్థ రూపొందించడం గమనార్హం.

రత్నం పెన్నులు వందల రూపాయల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ‘సుప్రీం’ అనే మోడల్ పెన్నులను కేవలం రాష్ట్రపతి, ప్రధానుల కోసం తయారు చేస్తున్నారు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వరకూ.. తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు రత్నం పెన్నులను వాడటం విశేషం. విదేశాల అధినేతలు సైతం రత్నం పెన్నులను వాడుతుంటారు. కోసూరి రత్నం సోదరుడు రమణమూర్తే కాకుండా వారి పిల్లలు సైతం పెన్నుల తయారీ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యూజ్ అండ్ త్రో పెన్నుల కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. కష్టపడి రత్నం బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు.

రాజమండ్రి అనగానే గుర్తొచ్చే వాటిలో రత్నం పెన్నులు ఒకటి. స్వాతంత్రోద్యమ సమయంలో విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న గాంధీ మహాత్ముడి పిలుపు మేరకు పూర్తి స్వదేశీ తయారీగా కోసూరి రత్నం ‘రత్నం పెన్ను’లను రూపొందించారు. ఈ పెన్నును చూసిన వెంటనే విదేశీ తయారీ కావొచ్చని గాంధీ అనుమానించారు. కానీ అది పూర్తిగా స్వదేశీ తయారీనే అని నిర్ధారించుకున్నాక మాత్రం గాంధీజీ మెచ్చుకున్నారు. మీ పెన్నును వాడుతున్నానంటూ.. 1935లో స్వయంగా మహాత్ముడు కోసూరి రత్నంకు లేఖ రాశారు.



1931లో రాజమండ్రిలో జస్టిస్ కృష్ణమాచారి సబ్‌ జడ్జిగా పని చేసేవారు. ఓ సందర్భంలో ఆయన వాడే జర్మనీ పెన్ను పాళీ విరిగిపోయింది. ఓ రోజంతా కష్టపడిన రత్నం.. దాన్ని కొత్త పాళీలా తయారు చేసి కృష్ణమాచారికి ఇచ్చారు. ఆయన రత్నం గారిని మెచ్చుకున్నారు. వెంటనే పెన్నుల కంపెనీ ప్రారంభించమని ఒత్తిడి చేశారు.

గాంధీ లేఖ రాయడంతో.. స్వదేశీ పెన్నుగా ‘రత్నం పెన్ను’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ పెన్నుల పాళీల తయారీలో బంగారం, వెండిని సైతం ఉపయోగించడం విశేషం. కేవలం గ్రామున్నర బరువున్న అతి చిన్న పెన్నులను సైతం రత్నం సంస్థ రూపొందించడం గమనార్హం.



రత్నం పెన్నులు వందల రూపాయల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ‘సుప్రీం’ అనే మోడల్ పెన్నులను కేవలం రాష్ట్రపతి, ప్రధానుల కోసం తయారు చేస్తున్నారు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వరకూ.. తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు రత్నం పెన్నులను వాడటం విశేషం. విదేశాల అధినేతలు సైతం రత్నం పెన్నులను వాడుతుంటారు. కోసూరి రత్నం సోదరుడు రమణమూర్తే కాకుండా వారి పిల్లలు సైతం పెన్నుల తయారీ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యూజ్ అండ్ త్రో పెన్నుల కారణంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. కష్టపడి రత్నం బ్రాండ్‌ను కొనసాగిస్తున్నారు.





Untitled Document
Advertisements