29 రోజులుగా నిలకడగా ఉంటూ వచ్చిన దేశీ ఇంధన ధరలు ఈరోజు పైకి కదిలాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త ఏడాదిలో తొలిసారి పెరిగాయి. పెట్రోల్ ధర 28 పైసలు, డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో బుధవారం పెట్రోల్ ధర రూ.87.34కు, డీజిల్ ధర రూ.80.88కు చేరింది.
అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.90.19కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.83.25కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.89.71కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.82.81కు ఎగసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. 26 పైసలు పెరుగుదలతో రూ.83.97కు చేరింది. డీజిల్ ధర 25 పైసలు పెరుగుదలతో రూ.74.12కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 26 పైసలు పెరుగుదలతో రూ.90.60కు చేరింది. డీజిల్ ధర 27 పైసలు పెరుగుదలతో రూ.80.78కు ఎగసింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.45 శాతం పెరుగుదలతో 53.84 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 0.08 శాతం పెరుగుదలతో 49.97 డాలర్లకు ఎగసింది.
ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.