దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIని నెటిజన్లు దుమ్ముదులిపేస్తున్నారు. నెట్టింట్లో ఎస్బీఐతో ఒక ఆట ఆడుకుంటున్నారు. దీని కంతటికీ ఒకే ఒక ట్వీట్ కారణం. ఎస్బీఐ జనవరి 5న ఒక ట్వీట్ చేసింది. ఇది కాస్తా వైరల్ అయిపోయింది.
‘అమెరికా జనాభా 33.2 కోట్లు.. ఎస్బీఐకి ఉన్న కస్టమర్లు 44.89 కోట్లు’ అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. దీనికి మళ్లీ యూఎస్ వర్సెస్ ఇండియా అని హ్యాష్ట్యాగ్ తగిలించింది. ట్వీట్లో కింద ఎస్బీఐ 2019-20 వార్షిక నివేదిక ప్రకారం అనే గమనిక ఉంచింది. ఈ ట్వీట్తో నెటిజన్లు చెలరేగిపోయారు.
ఎస్బీఐతో చెడుగుడు ఆడుకుంటున్నారు. రూ.7,000 కోట్ల నష్టం వచ్చిందని ఒకరంటే.. ఎన్పీఏల సంగతేంటని మరోకరు ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లు ఎక్కువున్నారు కనుకే సర్వీసులు బాగుండవని మరొకరు ఛలోక్తి పేల్చారు. సర్వీసులు సంగతి అలా ఉంచితే.. బ్యాంక్ సిబ్బంది చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నారని ఇంకొకరు ఎస్బీఐ ట్వీట్కు రిప్లే ఇచ్చారు.
అమెరికాలో అయితే నేను మీకు ఎలా సహాయపడగలను? అని అడుగుతారు. అదే ఇండియాలో అయితే లాంచ్ టైమ్ అయిందని వెళ్లిపోతారు లేదంటే వేరే కౌంటర్కు వెళ్లండి అంటూ సమాధానమిస్తారని మరో నెటిజన్ రిప్లే ఇచ్చారు. మరో నెటిజన్ అయితే ఆదివారం లోన్ మేళా, ఫెస్టివల్ రోజు రికవరీ మెళా అంటూ జోకులు పేల్చారు. కస్టమర్లు సరే మరి మీరు అందించే ఫెసిలిటీల సంగతేంటని మరొకరు ప్రశ్నించారు.
కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడం గొప్ప కాదని, నేను కూడా 44 కోట్ల మంది కస్టమర్లలో ఒకరినని, అయితే నెల రోజుల నుంచి నా ఫిర్యాదుకు పరిష్కారం లేదని రిప్లే ఇచ్చారు. అక్కడ అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అవుతుందని, ఇక్కడ అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుందని మీ డబ్బులు 2-3 రోజుల్లో మీకొస్తాయి అంటూ మెసేజ్ వస్తుందని మరొకరు రిప్లే ఇచ్చారు. ఇలా నెటిజన్లు ఎస్బీఐని చెడుగుడు ఆడుకుంటున్నారు.
: Population in 2020 was 33.2 crore
mdash; State Bank of India (@TheOfficialSBI) January 5, 2021
: SBI has 44.89 crore customers #USvsIndia
*As per SBI annual report of 2019-20.