'రోడ్డుపై నా బట్టలు విప్పింది అందుకే'...ఇష్యూపై శ్రీరెడ్డి కామెంట్స్!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:13 PM

'రోడ్డుపై నా బట్టలు విప్పింది అందుకే'...ఇష్యూపై శ్రీరెడ్డి కామెంట్స్!

విగ్రహాల ధ్వసం ఇష్యూ ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. వరుస ఘటనలకు రాజకీయ రంగు పులుముకోవడంతో.. ఈ ఇష్యూని లాభసాటిగా మర్చుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు కుయుక్తులు పన్నుతున్నాయనేది నేటి రాజకీయ వర్గాల్లో చర్చ. మొత్తానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలు పేల్చుకుంటూ.. మత రాజకీయాలకు తెరతీసి.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారనేది స్పష్ఠమౌతోంది.


ఈ తరుణంలో ఈ విగ్రహాల ధ్వంసం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని.. వైఎస్ జగన్‌ని రాజకీయం ఎదుర్కొనలేక ఇలాంటి నీఛమైన పనులకు ప్రతిపక్షపార్టీలే పాల్పడుతున్నాయంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్‌ని అతని ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి.

నేను ఈ లైవ్ పెట్టింది.. ఇది జగన్ గారిని టార్గెట్ చేయడానికి జరిగిన కుట్ర ఈ విగ్రహాల ధ్వంసం అని చెప్పడానికి. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సంబంధం లేదు. ఆయన క్రిస్టియన్ అని బురద చల్లడానికి దిగజారుడు రాజకీయ నాయకులు చేసిన పని.

మీరు ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే.. మీరు నిజంగా మగవాళ్లే అయితే డైరెక్ట్‌గా కొట్టుకోండి. జగన్‌ని డైరెక్ట్‌గా ఢీ కొట్టండి. అప్పుడు తేలిపోద్ది.. ఎవడు మగాడో. వైఎస్ రాజశేఖర్ గారి గురించో.. చంద్రబాబు గారి గురించో.. లేక లోకేష్ కోసమే.. దేవుడి విగ్రహాలను ఎలా ధ్వంసం చేస్తారు? రథాలు తగలబెడతారా?? నీకు మెంటల్ వస్తే ఏదైనా ఇంజక్షన్ చేసుకుని చచ్చిపో. నీ పిచ్చితో మమ్మల్ని చంపుతావా?

నేను రాజకీయాలు మాట్లాడటం లేదు. హిందూఇజాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు నా నోరు విప్పాను. అప్పట్లో రోడ్డుపై నా బట్టలు విప్పాను అమ్మాయిల కోసం. నన్ను చెత్త చేయాలని చాలామంది చూశారు. ధర్మంగా నిలబడి పోరాటం చేశా. పాపం చేయొద్దని హిందూ ధర్మం చెప్పింది. కానీ మాటలు చెప్తున్నారు పాపం.. చేస్తూనే ఉన్నారు. పెళ్లాన్ని కూడా గౌరవించమని హిందూ ధర్మంలో ఉంది. అది మాత్రం పాటించరు.

ప్రతి ఒక్కడు పవన్‌ని తిట్టింది.. పవన్ కళ్యాణ్ అమ్మని తిట్టింది అంటున్నారు.. నేను ఏ ఉద్దేశంతో ఆ మాట అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చా. ఆ తరువాత కూడా నన్ను టార్గెట్ చేశారు.. నీఛమైన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇప్పటికైనా వాళ్లకి మంచి బుద్ధి ఇవ్వాలని దేవుడ్ని కోరుతున్నా. ముఖ్యంగా అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేసే బుద్ధి ఇవ్వాలని కోరుతున్నా. ధర్మాన్ని ఆచరించేవాళ్లకి ఎప్పటికీ న్యాయం జరుగుతుంది.

ఇది పొలిటికల్ డ్రామా. వాళ్ల దగ్గర అన్ని అస్త్రాలు అయిపోతే ఇప్పుడు మతాలని తెరపైకి తీసుకువచ్చారు. ఒక పొలిటికల్ లీడర్‌ని నాశనం చేయాలంటే హిందువుల్ని రెచ్చగొట్టాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి. కాస్తైనా బుర్ర ఉందా..? మనిషి పుట్టుకే పుట్టారా?? ఇలాంటి పిచ్చపనులు చేస్తారా?? ఇంత ఏజ్ వచ్చిన తరువాత కూడా రాజకీయాల్లో ఇలాంటి పెంట పనులు చేయిస్తారా?.. ఇది కంప్లీట్‌గా జగన్ మోహన్ రెడ్డిగారిని టార్గెట్ చేయడానికి చేసిన రాజకీయ కుట్ర’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.





Untitled Document
Advertisements