తెలంగాణలో బర్డ్ ఫ్లూ

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 04:14 PM

తెలంగాణలో బర్డ్ ఫ్లూ

బర్డ్ ఫ్లూపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వెటెర్నరీ భవన్లో బర్డ్ ప్లూపై అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సమావేశానికి వెటెర్నరీ, యానిమల్ హస్బెండరీ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో బర్డ్ ఫూ రాకుండా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వలస పక్షల రాకపై ఆరా తీసి అప్రమత్తం కావాలని సూచించారు. ప్రతిరోజు పౌల్ట్రీ ఫారాల్లో చనిపోయో కోళ్ల శాంపిల్స్ VBTI పంపి పరీక్షించాలని అధికారుల్ని ఆదేశించారు.

ఓ వైపు కరోనా కలవరం మరోవైపు బర్డ్‌ఫ్లూ భయపెడుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా నాలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలపై నిషేధం విధించారు. ఎందుకంటే కోళ్ల నుంచి ఇది వేగంగా విస్తరించే అవకాశం ఉంది. కోళ్లు మాత్రమే కాదు.. ఇతర పక్షులు, చేపల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇక, బర్డ్‌ఫ్లూపై అధికారులతో సమీక్ష నిర్వహించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బర్డ్‌ ఫ్లూ విషయంలో ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుందన్న ఆయన.. 1300 మందితో ఏర్పాటు చేసిన ప్రత్యేక టీమ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫామ్ లలో తిరుగుతూ సూచనలు చేస్తున్నట్టు వెల్లడించారు.
అయితే, వలస పక్షుల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఎఫెక్ట్ ఉండొచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు తలసాని. బర్డ్ ఫ్లూ వస్తుందంటూ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.
మరోవైపు బర్డ్‌ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకు వచ్చే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. ఈ వైరస్‌ కోళ్లకు సోకినప్పుడు రెండు రకాల లక్షణాలు కన్పిస్తాయి. ఈ వైరస్ తీవ్రత తక్కువగా ఉంటె.. కోళ్ల ఈకలు రాలిపోవడంతో పాటు, గుడ్డు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అదే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే.. కోడి శరీరంలోని వివిధ అవయవాలు దెబ్బతిని 48 గంటలోపు మరణిస్తుంది. కోడి విసర్జన ద్వారా ఈ వ్యాధి ఒక దాని నుంచి మరొక కోడికి త్వరగా వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్‌ వ్యాప్తికి వివిధ పక్షులు వాహకాలుగా పనిచేస్తాయి. పక్షుల నుంచి కూడా ఈ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉంది.





Untitled Document
Advertisements