మందుబాబులకి షాక్ ఇచ్చిన కరోనా వ్యాక్సిన్..!

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 06:15 PM

మందుబాబులకి షాక్ ఇచ్చిన కరోనా వ్యాక్సిన్..!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మనందరికీ గుడ్ న్యూస్.అయితే ఈ విషయం మందుబాబులకి మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు కారణం. ఈ వ్యాక్సిన్ తీస్కోవడానికి ముందు, తరువాత వారు మద్యపానానికి దూరంగా ఉండాలని లేదంటే ఈ మందు పనిచేయదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదేంటి ఇలాంటి ఫిట్టింగ్ పెట్టారు? అనుకుంటున్నారా, అయితే మీరు ఈ మెడిసిన్ స్పెషలిస్ట్ చెప్పిన విషయాన్ని తెలుసుకోవల్సిందే.

ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రానక్స్ ఇఖారియా.. ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ మద్యం వల్ల వ్యాక్సిన్ తీసుకొనేవారికి కలిగే నష్టం గురించి వివరించారు. ఇందులో భాగంగా ఇఖారియా.. ప్రాసిక్కో అనే వైట్ వైన్ తాగిన కొంతమంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. మద్యం వల్ల వారిలో లింఫోసైట్ కణాలు 50 శాతానికి పడిపోయినట్లు కనుగొన్నారు.
ఈ సందర్భంగా మాంచెస్టర్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ షీనా క్రూక్‌శాంక్ మాట్లాడుతూ.. లింపోసైట్ కణాలు పడిపోవడం వల్ల వ్యాపిక్స్‌ను ప్రభావం తగ్గిపోతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోడానికి ముందు ప్రజలు వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలని కోరారు. ‘‘మీ రోగ నిరోధక వ్యవస్థ వ్యాక్సిన్‌‌కు సానుకూలంగా స్పందించి.. సక్రమంగా పనిచేయాలంటే.. మీరు తప్పకుండా మద్యానికి దూరంగా ఉండాలి. అంటే, వ్యాక్సిన్ తీసుకోడానికి ముందు రోజు రాత్రి మద్యం తాగొద్దు. అలాగే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మద్యాన్ని ఒక రోజు ముట్టుకోవద్దు’’ అని తెలిపారు.
‘ల్యాడ్‌బైబిల్’ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. మన తెల్ల రక్త కణాల్లో 20 నుంచి 40 శాతం వరకు లింఫోసైట్ కణాలు ఉంటాయని తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థకు ఇవి ఎంతో కీలకమైనవే కాకుండా తప్పనిసరిగా ఉండాల్సిన కణాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోడానికి ముందు, ఆ తర్వాత.. ఈ కణాలు క్షీణిస్తే సరిగ్గా పనిచేయదని స్పష్టం చేస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలుకానున్న నేపథ్యంలో నిపుణులు చెప్పిన ఈ సూచన పాటిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది.





Untitled Document
Advertisements