తప్పుడు కథనాలపై రేణూ దేశాయ్ ఫైర్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:14 PM

తప్పుడు కథనాలపై రేణూ దేశాయ్ ఫైర్

తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యారు ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్. వ్యూస్ కక్కుర్తి కోసం.. తమ బిజినెస్ కోసం తప్పుడు వార్తల్ని ప్రసారం చేస్తున్నారని ఇలాంటి వెబ్ సైట్స్‌ని వాళ్ల ఖాతాలను ఎంకరేజ్ చేయొద్దంటూ తన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్.


పవన్ మాజీ భార్యకు కరోనా పాజిటివ్.. కానీ!! అంటూ ‘తెలుగు స్టాప్.కమ్’‌లో ఒక వార్తను ప్రసారం చేశారు. అందులో రేణూ దేశాయ్ తనకు కరోనా సోకినట్టుగా ప్రకటిందని.. చాలా రోజుల క్రితమే తనకు కరోనా సోకిందని దాన్ని నుంచి కోలుకున్నారని.. కరోనా నిర్ధారణ అయిన సమయంలో కొన్ని రోజులు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందని.. ప్రస్తుతం ఇంటికి పరిమితం అయినట్టుగా రేణు దేశాయ్ చెప్పిందనేది ఆ వార్త సారాంశం.

అయితే ఈ ఫేక్ వార్తపై ఫైర్ అయ్యారు రేణు దేశాయ్.. ఈ సందర్భంగా తనకు కరోనా నెగిటివ్ వచ్చిన రిపోర్ట్స్‌ని షేర్ చేస్తూ ఆ వెబ్ సైట్‌ని ఏకిపారేశారు.

‘ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.. దయచేసి ఇలాంటి తప్పుడు కథనాలను ప్రసారం చేసే స్టుపిడ్ వెబ్ సైట్స్‌ని ఫాలో కావడం వాళ్ల వార్తల్ని నమ్మడం మానేయాలని కోరుతున్నా. ఈ వెబ్ సైట్ ట్విట్టర్ ఖాతాలో కూడా తప్పుడు కథనాలే వస్తున్నాయి. ఈ స్టుపిడ్ వెబ్ సైట్ అబద్ధాలు, తప్పుడు వార్తలతోనే మనుగడ సాగిస్తున్నారు. సెలబ్రిటీలు ధృవీకరించబడిన ఖాతాలను మాత్రమే నమ్మండి. దయచేసి ఇలాంటి అన్ ఫెయిర్ స్టుపిడిటీ వార్తల్ని నమ్మొద్దు. అభిమానులకు ఏదైనా విషయాన్ని తెలియజేయడానికి సెలబ్రిటీలందరికీ అఫీషియల్ ఖాతాలు ఉన్నాయి. వాటి ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఇలాంటి స్టుపిడ్స్ వెబ్ సైట్స్.. సెలబ్రిటీల గురించి అబద్ధాలు చెప్పి.. తప్పుడు కథనాలను ప్రసారం చేయడం ద్వారా ఫాలోవర్స్‌ని పెంచుకుంటారు. నిజాయితీగా పనిచేయరు. దయచేసి ఈ వెబ్ సైట్‌ని ఫాలో కావద్దు.. తప్పుడు వార్తల్ని చూస్తూ వాళ్లకి మరింత వ్యాపారాన్ని ఇవ్వొద్దు’ అంటూ ఆ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యారు రేణూ దేశాయ్.

గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి కూడా తప్పుడు కథనాలు ప్రసారం కావడం వాటిని ఖండిస్తూ వెబ్ సైట్స్‌పై ఫైర్ అయ్యారు రేణూ దేశాయ్.






Untitled Document
Advertisements