ఎల్‌ఐసీ గుడ్ న్యూస్...అందుబాటులోకి మరో ఛాన్స్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 02:29 PM

ఎల్‌ఐసీ గుడ్ న్యూస్...అందుబాటులోకి మరో ఛాన్స్

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC తన కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. పాలసీ దారులకు మరో అవకాశం కల్పిస్తోంది. స్పెషల్ రివివల్ కాంపెయిన్‌ను ఆవిష్కరించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగనుంది.

ఎల్‌ఐసీ కొత్త కాంపెయిన్ జనవరి 7 నుంచే ప్రారంభమైంది. మార్చి 6 వరకు ఇది కొనసాగుతోంది. మీరు కూడా ఎల్‌ఐసీ పాలసీ తీసుకొని, ప్రీమియం చెల్లించలేకపోవడంతో అది ల్యా్ప్స్ అయిపోయి ఉంటే.. మీరు మార్చి 6లోపు మీ పాలసీని మళ్లీ పునరుద్దరించుకోవచ్చు.
ఐదేళ్ల నుంచి ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించకుండా ఉన్న వారు ఈ క్యాంపెయిన్ ద్వారా వారి పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. అయితే ఎంపిక చేసిన పాలసీలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి. ఎల్‌ఐసీ గతంలో కూడా 2020 ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు ఇలాంటి ఊరట కలిగించింది.

పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవాలని భావించే వారికి రూ.2000 వరకు ఆలస్య ఫీజులో రాయితీ పొందొచ్చు. వార్షిక ప్రీమియంలో 25 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పాలసీ ప్రీమియం చెల్లించలేని వారికి ఎల్‌ఐసీ అందించే ఈ అవకాశం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.





Untitled Document
Advertisements