కిలో చికెన్ రూ.15!

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:38 PM

కిలో చికెన్ రూ.15!

ఓ వైపు కరోనా మరోవైపు బర్డ్ ఫ్లూ భయం ప్రజల్ని వెంటాడుతోంది. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. ఈ ప్రభావం కోళ్ల ఫారాలపై అధికంగా పడుతోంది. కరోనా కారణంగా ప్రారంభంలో పడిపోయిన చికెన్, కోడి గుడ్లు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. అప్పట్లో చికెన్ ధర కిలో రూ. 50 కూడా పలకలేదు. గుడ్డు ధర కూడా భారీగా పడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ధరలు పుంజుకున్నాయి. ఇప్పుడు బర్డ్ ఫ్లూ కారణంగా మరోసారి చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో గత కొన్ని నెలలుగా గుడ్లు, చికెన్, మాంసం వినియోగం బాగా పెరిగింది. అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వల్ల పక్షులు చనిపోతున్నాయని తెలిసినప్పటి నుంచి గుడ్లు, చికెన్‌ తీసుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు.

హర్యానాలోని జీంద్ జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ విలవిలలాడుతోంది. అయితే పౌల్ట్రీవ్యాపారులు, పశువైద్యులు చికెన్ తినడంలో ఇబ్బందేమీ ఉండదని చెబుతున్నారు. అయినప్పటికీ చికెన్ ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఢిల్లీలో కిలో చికెన్ రూ. 15కు పడిపోయింది. ఈ కారణంగా కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు ఒక కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. హర్యానాలోని జీంద్ జిల్లా పౌల్ట్రీ హబ్ గా పేరొందింది. జిల్లాలో 500కు మించిన పౌల్ట్రీ ఫారాలు, 80కి మించిన హ్యాచరీలు ఉన్నాయి. ఇక్కడి నుంచి 100 వాహనాల్లో ప్రతీరోజూ సుమారు నాలుగు లక్షల కోళ్లు ఢిల్లీకి విక్రయించేందుకు వెళుతుంటాయి.

గతంలో ఢిల్లీలో కిలో కోడి బరువు రూ. 90 రూపాయల వరకూ పలికేది. ఈ విధంగా ప్రతీరోజూ 7 కోట్ల 20 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. 70 డిగ్రీల వద్ద చికెన్ ఉడికించి తినడం వలన ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశం బర్డ్ ఫ్లూ నుంచి విముక్తి చెందిందని కేంద ప్రభుత్వం మూడు నెలల క్రితమే ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా కోళ్లు మృతి చెందుతున్నాయంటే దానికి అధిక చల్లదనమే కారణమని తెలిపింది. బ్రాయిలర్ కోడి కిలో రూ. 15 పలుకుతుండడంతో చికెన్ దుకాణ దారులు గగ్గోలుపెడుతున్నారు. అటు మాంసప్రియులు మాత్రం కొందరు పండగ చేసుకుంటున్నారు. తమకు ఎంతో ఇష్టమైన చికెన్ చీప్ ధరకే దొరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements