కేంద్రం నుంచి అటల్ పెన్షన్ స్కీమ్...ప్రతి నెలా రూ.5 వేల వరకు పెన్షన్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:48 PM

కేంద్రం నుంచి అటల్ పెన్షన్ స్కీమ్...ప్రతి నెలా రూ.5 వేల వరకు పెన్షన్

కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అందిస్తోంది. అసంఘటిత రంగంలో పని చేసే వారు లక్ష్యంగా ఈ స్కీమ్ ఉంటుంది. వీరికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు.

బ్యాంకులకు వెళ్లి కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అందిస్తోంది. మీరు నేరుగా ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొర్చు. ఇతర బ్యాంకులు కూడా ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తు్న్నాయి.

మీరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరితే నెలకు కనీసం రూ.1000 పెన్షన్ పొందొచ్చు. రూ.2,000, రూ.3 వేలు, రూ.4,000, రూ.5 వేలు పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అయితే మీరు చెల్లించే నెలవారి కంట్రిబ్యూషన్ ప్రాతిపదికన మీకు వచ్చే పెన్షన్ కూడా మారుతుంది.

60 ఏళ్ల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది. ఒకవేళ సబ్‌స్కైబర్ మరణిస్తే.. వారి భాగస్వామికి పెన్షన్ అందిస్తారు. లేదంటే చెల్లించిన డబ్బును వెనక్కి ఇచ్చేస్తారు. ఎస్‌బీఐ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా 15 లక్షల మందికి పైగా చేరారు. డిసెంబర్ 31 నాటికి ఈ స్కీమ్‌లో 52 లక్షల మందికి పైగా చేరారు అని పీఎఫ్‌ఆర్‌డీఏ తెలిపింది.





Untitled Document
Advertisements