జనవరి 15న మరోసారి రైతు సంఘాలతో భేటీ

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 06:50 PM

జనవరి 15న మరోసారి రైతు సంఘాలతో భేటీ

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబట్టగా.. చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇరుపక్షాలు పట్టు వీడకపోవడంతో చర్చలు కొలిక్కి రాకుండానే వాయిదా పడ్డాయి. జనవరి 15న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. రైతు సంఘాల ప్రతినిధులు జనవరి 11న సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఆ భేటీలో నిర్ణయం తీసుకుంటారు.





Untitled Document
Advertisements