తమిళనాడు గవర్నర్ గా రెబల్ స్టార్ కృష్టంరాజు!?

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 06:54 PM

తమిళనాడు గవర్నర్ గా రెబల్ స్టార్ కృష్టంరాజు!?

రెబల్ స్టార్ కృష్టంరాజు తమిళనాడు గవర్నర్ గా భాద్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటనేమీ వెలువడలేకపోయినప్పటికీ.. ఆయన నియామకం దాదాపు ఖరారైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నటుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఉన్నప్పుడే 1990లో కృష్ణంరాజు బీజేపీలో చేరారు. రెండు దఫాలుగా ఎంపీగా పనిచేశారు. 2000-2002 వరకు వాజ్పేయి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 దాకా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కూడా పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. కాగా.. 2016 లో తమిళనాడు గవర్నర్ పదవి నుంచి రోశయ్య వైదొలిగారు. అప్పట్నుంచి ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో గవర్నర్ ను నియామకం కాలేదు. మధ్యలో కొన్ని రోజుల పాటు మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన విద్యాసాగర్ రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఆయన తన పదవి నుంచి వైదొలిగిన నుంచి రాష్ట్రంలో రాజ్ భవన్ ఖాళీగానే ఉంది. ఇక తాజాగా కృష్ణంరాజు పేరు తెరపైకి రావడం గమనార్హం.





Untitled Document
Advertisements