సివిల్స్‌ పరీక్షలో యువతి చీటింగ్...కూతురి నిర్వాహకం తెలిసి!!!

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 05:53 PM

సివిల్స్‌ పరీక్షలో యువతి చీటింగ్...కూతురి నిర్వాహకం తెలిసి!!!

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించినట్లు తల్లిదండ్రులను నమ్మించిన ఓ యువతి(23) అదే హాల్‌టికెట్‌తో మెయిన్స్‌ పరీక్షకు హాజరై పోలీసులకు చిక్కిన ఘటన శుక్రవారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్‌ పరీక్ష శుక్రవారం జరిగింది. హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(బాలురు)లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ యువతి ఈ కేంద్రానికి వచ్చింది. ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లగా ఇన్విజిలేటర్ ఆమె హాల్ టిక్కెట్‌ని పరిశీలించి నకిలీదిగా గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి సమాచారం ఇవ్వగా... వారి ఆదేశాలతో హబీబ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నంద్యాలకు చెందిన యువతి కొన్నాళ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతా గతేడాది అక్టోబరులో ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అందులో అర్హత సాధించలేకపోయినా తల్లిదండ్రులకు మాత్రం అబద్ధం చెప్పి నమ్మించింది. శుక్రవారం నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షకు ప్రిలిమినరీ హాల్‌టికెట్‌(ఈ-అడ్మిట్‌కార్డు)తో వచ్చింది. అయితే ఇన్విజిలేటర్‌ పరిశీలనలో అసలు విషయం బయటపడటంతో ఆమె తల్లిదండ్రులు సైతం షాకైనట్లు తెలుస్తోంది. కుమార్తె చేసిన మోసంతో వారు కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు





Untitled Document
Advertisements