62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేషియా విమానం అదృశ్యం!

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 06:05 PM

62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేషియా విమానం అదృశ్యం!

ఇండోనేషియాలో ఓ విమానం అదృశ్యమవడం కలకలం రేపుతోంది. జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన శ్రీవిజ‌య సంస్థకు చెందిన బోయింగ్-737 విమానం బయల్దేరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో క్రూ సిబ్బందితో పాటు 62 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కాల‌మానం ప్రకారం శనివారం (జనవరి 9) మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల‌కే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయ‌ని తెలిపారు.

విమానం ఆచూకీ కోసం అధికారులు రాడార్ స‌మాచారాన్ని విశ్లేషిస్తున్నారు. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులు, మహిళలు స‌హా 59 మంది ప్రయాణికులు ఉన్నార‌ని ఇండోనేషియా అధికారులు తెలిపారు. విమానం జ‌క‌ర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోన్‌టియాన‌క్‌కు వెళ్తుండగా అదృశ్యమైంది.

అదృశ్యమైన స‌మ‌యంలో ఫ్లైట్ భూమికి 10 వేల అడుగుల ఎత్తులో ఉంద‌ని వెల్లడించారు. నిర్జన ద్వీపంలో విమానం కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements