ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎన్నిక జరగను ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.... ఈ ఖాళీని భర్తిచేసేందుకు జనవరి 28న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ జరుగుతుందని షెడ్యుల్ విడుదల చేసింది.
పోతుల సునీత శాసన మండలి సభ్యత్వానికి గత నెలలో రాజీనామా లేఖను చైర్మన్కు పంపించారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.ఈ రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు.. మండలి ఛైర్మన్ షరీఫ్ సునీత రాజీనామా లేఖను ఆమోదించారు. పోతుల సునీత 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు.. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. దాంతో వెంటనే చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్సార్సీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత సునీత కూడా అనూహ్యంగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ను కలిసి ఫిర్యాదు చేయగా.. విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే సునీత తన పదవికి రాజీనామా చేశారు.
ఈ నేపధ్యంలో సిఎం జగన్ మోహన్రెడ్డితో మాజీ ఎమ్మెల్యే పోతుల సునీత సోమవారం భేటీ అయ్యారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోతుల సునీత బరిలో దిగనున్నారు. ఈ క్రమంలో పోతుల సునీతకు సీఎం జగన్ బీఫామ్ అందజేశారు. ఇటీవలే ఆమె టీడీపీ తరపున పదవికి రాజీనామా చేయగా.. ఆ సీటు మళ్లీ ఆమెకే కేటాయించారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్యేల కోటాలో జరగనున్న ఈ ఎన్నిక నోటిఫికేషన్ జనవరి 11న విడుదలకానుంది. నామినేషన్లు పరిశీలన జనవరి18 .. నామినేషన్ పరిశీలన జనవరి 19న .. జనవరి 28న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది.