డబ్బు సంపాదించాలని ఆలోచించే వారికి శుభవార్త...రూ.20 వేలతో రూ.3.5 లక్షలు లాభం

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:33 AM

డబ్బు సంపాదించాలని ఆలోచించే వారికి శుభవార్త...రూ.20 వేలతో రూ.3.5 లక్షలు లాభం

డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి అందుబాటులో ఉంది. కరోనా వైరస్ దెబ్బకి ఉపాధి కోల్పోయిన వారు, లేదంటే ఇంటి వద్ద నుంచే బిజినెస్ చేయాలని ఆలోచించే వారికి ఇది అనువుగా ఉంటుంది.
బోన్సాయ్ చెట్ల ద్వారా మంచి రాబడి పొందొచ్చు. అస్ట్రాలజీ, ఆర్కిటెక్చర్ వంటి వాటిల్లో ఈ చెట్లను ఉపయోగిస్తారు. ఇంట్లో డెకరేషన్ కోసం బోన్సాయ చెట్లు పెట్టుకుంటారు. ఇంకా కొంత మంది కొన్ని చెట్లు ఇంట్లో ఉంటే లక్కీ అని భావిస్తారు. ఇలాంటి వారు కూడా బొన్సాయి చెట్లను ఇంట్లో పెట్టుకుంటారు.
మీరు బొన్సాయ్ చెట్ల వ్యాపారాన్ని కేవలం రూ.20 వేలతో కూడా ప్రారంభించొచ్చు. లేదంటే మీరు భారీ స్థాయిలో కూడా చెట్ల వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చెట్లకు ఆర్థిక చేయూత అందిస్తుంది. తొలిగా చిన్న స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించి, తర్వాత విస్తరించుకుంటూ వెళ్లొచ్చు.
కేవలం ఇళ్లలో మాత్రమే కాకుండా ఆఫీసుల్లో కూడా బొన్సాయ్ చెట్లను పెట్టుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ చెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్ల మీరు ఈ వ్యాపారం చేస్తే మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు. వీటి ధర రూ.200 నుంచి రూ.2,500 వరకు ఉంటుంది.
బొన్సాయ్ చెట్లు పెరగడానికి రెండు నుంచి ఐదేళ్ల వరకు కాలం పడుతుంది. ఇలా కాకుండా మీరు నర్సరీలో పెంచిన చెట్లను తీసుకువచ్చి నేరుగా విక్రయించొచ్చు. మీరు 30 నుంచి 50 శాతం అధిక రేటుకు ఈ చెట్లను అమ్మొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ చెట్ల పెంపకానికి 50 శాతం ఆర్థిక సాయం అందిస్తుంది. మిగతా సగం రైతులు పెట్టుకోవాలి. జిల్లాలోని నోడల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
ఒక హెక్టార్‌లో 1500 నుంచి 2500 వరకు చెట్లను పెంచొచ్చు. 4 ఏళ్ల తర్వాత మీరు రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు రాబడి పొందొచ్చు. అందువల్ల మీరు వ్యాపారం చేయాలని భావిస్తే.. తొలిగి సింపుల్‌గా బొన్సాయ్ చెట్ల సాగును ప్రారంభించొచ్చు.





Untitled Document
Advertisements