బ్యాంకులో డబ్బుజమ చేసేవారికి గుడ్ న్యూస్....ఆ చార్జీలు ఉండవు

     Written by : smtv Desk | Tue, Jan 12, 2021, 09:36 AM

బ్యాంకులో డబ్బుజమ చేసేవారికి గుడ్ న్యూస్....ఆ చార్జీలు ఉండవు

పిల్లల పేరుపై లేదంటే రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం చాలా మంది బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. కొంత డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. బ్యాంక్‌కు వెళ్లి ఒక్కసారి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. ఆ డబ్బును మళ్లీ మెచ్యూరిటీ తర్వాతనే తీసుకోవాలి.
ఏదైనా ఆర్థిక ఇబ్బంది కారణంగా డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించడం లేదంటే చార్జీలు వసూలు చేయడం వంటివి చేస్తుంది. చాలా బ్యాంకుల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక బ్యాంక్ మాత్రం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్న వారికి తీపికబురు అందించింది.
ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి డబ్బుల ముందుగానే తీసుకుంటే పెనాల్టీలు ఉండవని ప్రకటించింది. ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 తర్వాత ఓపెన్ చేసిన అన్ని కొత్త ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.

అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. 2 ఏళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలకే ఇది వర్తిస్తుంది. కస్టమర్ల ఫ్రెండ్లీ రూల్ తీసుకువచ్చామని, అత్యవసర ఆర్థిక ఇబ్బందుల వల్ల దీర్ఘకాల సేవింగ్స్‌పై ప్రభావం పడకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.
మీరు యాక్సిస్ బ్యాంక్‌కు వెళ్లి కేవలం రూ.5,000తో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. 7 రోజుల నుంచి పదేళ్ల కాల పరిమితితో బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీకు బ్యాంక్‌లో డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే గరిష్టంగా 6 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది.





Untitled Document
Advertisements