గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్...30 నిమిషాల్లోనే సిలిండర్

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 12:27 PM

గ్యాస్ సిలిండర్ కస్టమర్లకు గుడ్ న్యూస్...30 నిమిషాల్లోనే సిలిండర్

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే తీపికబురు అందబోతోంది. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రోజులక కొద్ది వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదు. కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి ఊరట కలుగనుంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL తత్కాల్ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీని కోసం తత్కాల్ ఎల్‌పీజీ సేవలను ఆవిష్కరించనుంది. దీంతో కస్టమర్లు బుక్ చేసిన రోజునే ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది.

‘తత్కాల్ ఎల్‌పీజీ సేవలను అందించడానికి వీలుగా ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక్క పట్టణం లేదా జిల్లాను గుర్తించండి. ఈ సేవల కింద కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నుంచి 45 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్‌ను అందించడానికి ప్రయత్నిస్తాం’ అని ఐఓసీఎల్ టాప్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

అయితే ఈ కొత్త సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో కచ్చితంగా తెలీదు. కానీ ఫిబ్రవరి 1 కల్లా అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ తన కస్టమర్లకు ఇండేన్ గ్యాస్ రూపంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సర్వీసులు అందిస్తున్న విషయం తెలిసిందే. 14 కోట్ల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
ఐఓసీఎల్ మరీముఖ్యంగా సింగిల్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారు లక్ష్యంగా ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువస్తోంది. సింగిల్ సిలిండర్ అయిపోయిన వారు మళ్లీ సిలిండర్ వచ్చేంత వరకు ఇబ్బందులు పడుతుంటారు. అందుకే వీరికి వెంటనే సిలిండర్ అందేలా కంపెనీ నిర్ణయం తీసుకుంటోంది.





Untitled Document
Advertisements