'RED' వేదికపై 'KRACK' ప్రమోషన్స్...పాపం రామ్!!!

     Written by : smtv Desk | Wed, Jan 13, 2021, 12:42 PM

'RED' వేదికపై 'KRACK' ప్రమోషన్స్...పాపం రామ్!!!

సినిమాలో నటించిన ఆర్టిస్టులతో మొదలుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, హీరో రామ్, హీరోయిన్లు, దర్శకుడు తిరుమల కిశోర్ అంతా సినిమా గురించి గొప్పగా చెప్పారు. జనవరి 14న థియేటర్లలో మోత మోగడం ఖాయమన్నారు. త్రివిక్రమ్ స్పీచ్ అయితే ఈ ఈవెంట్‌కే హైలైట్. కానీ, చిత్ర యూనిట్ చేసిన చిన్న తప్పిదం ఈ ఈవెంట్‌కే మచ్చ తెచ్చింది. వేడుక ఆఖరిలో మూవీ బిగ్ టికెట్‌ను అతిథి త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు రామ్, మిగిలిన టీం అందజేశారు. ఆ టికెట్‌ను ఆవిష్కరిస్తే దానిపై ‘రెడ్’ సినిమా పేరు లేదు. జనవరి 9న విడుదలైన ‘క్రాక్’ సినిమా పేరు ఉంది.

తప్పిదాన్ని గ్రహించిన రామ్.. వెంటనే ఆ టికెట్‌పై ‘క్రాక్’ అని రాసి ఉన్న చోట ‘రెడ్’ స్టిక్కర్ అతికించి దానితోనే ఫొటోలు దిగారు. కానీ, విడుదల తేదీ జనవరి 9ని మాత్రం మార్చలేదు. ఈ తప్పిదాన్ని పట్టుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంత పెద్ద ఈవెంట్ చేసి ఆ మాత్రం చూసుకోరా అంటూ ఆడేసుకుంటున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ అయితే తమ హీరో సినిమాను ప్రమోట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే, బ్లాక్ బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘రెడ్’. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ కథానాయికలు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాల తర్వాత రామ్-కిశోర్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన తిరుమల కిశోర్.. ఈసారి ‘రెడ్’ ద్వారా థ్రిల్లర్ జానర్‌‌ను ఎంపిక చేసుకున్నారు.





Untitled Document
Advertisements