నో ఇంటర్వ్యూస్....డిగ్రీ అర్హత ఉన్న వారికి 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

     Written by : smtv Desk | Sat, Jan 16, 2021, 09:14 AM

నో ఇంటర్వ్యూస్....డిగ్రీ అర్హత ఉన్న వారికి 6506 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ డిపార్ట్ మెంట్లలో పని చేయడానికి గ్రూప్-బి గెజిటెడ్‌, నాన్-గెజిటెడ్, గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటలిజెన్స్ బ్యూరో, సీబీఐ, రైల్వే, పోస్టల్, ఇన్ కమ్ టాక్స్ తదితర విభాగాల్లో ఆఫీసర్లు, అసిస్టెంట్లు, ఇన్ స్పెక్టర్లు మొదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి డిగ్రీ అర్హత ఉంటే చాలు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.

మొత్తం పోస్టులు: 6506
గ్రూప్-బి గెజిటెడ్- 250
గ్రూప్-బి నాన్-గెజిటెడ్- 3513
గ్రూప్-సి - 2,743

అర్హతలు:

ఏదైనా విభాగం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థులూ అర్హులే. అయితే 01.01.2021 నాటికి సంబంధిత అర్హ‌త పూర్తి చేసి ఉండాలి. కనిష్ఠ వయసు పరిమితి 18 ఏళ్లు. పోస్టును అనుసరించి గరిష్ఠ వయసు పరిమితి 30-32 ఏళ్ల వరకు ఉంది.

దరఖాస్తు విధానం:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు.

బీఈ, బీటెక్‌తో ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఎంపిక విధానం:

నాలుగు అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ద‌శ‌ల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మూడోది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. నాలుగోది కంప్యూటర్‌ స్కిల్‌టెస్ట్‌(టైపింగ్‌). గతంలో నిర్వహిస్తుండే మౌఖిక పరీక్షను తొలగించి, ఆ స్థానంలో చివరి రెండు అంచెలను ప్రవేశపెట్టారు. ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందిన వారిని మాత్రమే తర్వాత జరగబోయే పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు. ఆన్‌లైన్ ‌రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు (1/4వ వంతు) ఉన్నాయి.

ముఖ్య వివరాలు:

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 31, 2021.
టైర్-1 పరీక్ష తేది: మే 29, 2021 నుంచి జూన్‌ 7, 2021 వరకు జరుగుతుంది.
టైర్-2 పరీక్ష (డిస్ర్కిప్టివ్) తేదీని వెల్లడించాల్సి ఉంది.
వెబ్ సైట్: https://ssc.nic.in/





Untitled Document
Advertisements