ముంబాయి, డిసెంబర్ 12: వరుసగా మూడు రోజుల సెషన్లలో లాభాల్లో పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు కొద్దిగా బ్రేక్ పడింది. ట్రేడింగ్ ప్రారంభ౦ నుంచే నష్టాల్లో కొనసాగుతూ సెన్సెక్స్ 98 పాయింట్ల నష్టంతో 33,357 వద్ద ఉంది. ఇటు నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 10,282 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈనాటి ట్రేడింగ్ లో భారత పెట్రోలియ౦ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.