న్యూఢిల్లీ, డిసెంబర్ 12: అత్యాధునిక భద్రతా లక్షణాలతో, ముఖ్యంగా పాదచారులను, సైక్లిస్టలను గుర్తించగలిగే టెక్నాలజీతో స్వీడన్కు చెందిన లగ్జరీ కార్ మేకర్ వోల్వో కార్స్ ఓ కారును విడుదల చేసింది. 'ఎస్యూవీ ఎక్స్ సి 60' కొత్త వెర్ష న్ ను విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 55.9లక్షలు (ఎక్స్ ఫోరూం. ఆల్ ఇండియా) గా నిర్ణయించింది.
ఎక్స్ సి 60 ప్రపంచ వ్యాప్తంగా కొనుగోలు దారులను ఆకట్టుకునే మోడల్ మాత్రమే కాకుండా, భారతదేశంలో కూడా మంచి గుర్తింపు పొందే మోడల్ ఇదే కావాలని వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 19 డీలర్ షిప్లనును కలిగి ఉన్న వోల్వో, మరిన్ని కొత్త ఫీచర్స్ తో కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి రానుంది.