న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ షియోమీ మరో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఇటీవల మూడు నెలల కిందట విడుదలైన షియోమీ ఎంఐ ఏ1 స్మార్ట్ఫోన్పై రూ.1000 తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.13,999గా ఉంది. ఈ విషయాన్నీ కంపెనీ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ వెల్లడించారు.
ఈ ఫోన్ గోల్డ్, బ్లాక్, రోజ్ కలర్స్లో లభ్యం కానుంది. ప్రస్తుతం ఎంఐ.కామ్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లలో దీన్ని విక్రయిస్తున్నారు. అంతేకాదు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులను వినియోగిస్తే ఐదుశాతం తగ్గింపును, దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, రూ.99కే బై బ్యాక్ గ్యారెంటీ సదుపాయాలను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.
'ఎంఐ ఏ1' ఫీచర్లు ఇలా..
# 5.50 అంగుళాల తాకేతెర
# 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
# 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
# వెనుక వైపు 12+12 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా
# 4జీబీ ర్యామ్
# ఆండ్రాయిడ్ 7.1.2 ఓఎస్
# 3080 ఎంఏహెచ్ బ్యాటర
# 64 జీబీ అంతర్గత స్టోరేజీ