సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో విరుష్క జోడీ

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:09 PM

సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో విరుష్క జోడీ

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకలు అహ్మదాబాద్‌లో భారత క్రికెటర్ల మధ్య సందడిగా జరిగింది. ఇంగ్లాండ్‌తో గత శనివారం టెస్టు సిరీస్‌ ముగియగా.. ఈ సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా సాహాకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సూపర్ ఫామ్‌లోనే ఉన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కే టీమిండియా మేనేజ్‌మెంట్ వరుసగా నాలుగు టెస్టుల్లోనూ ఛాన్స్ ఇచ్చింది. దాంతో.. సాహా రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ వేదికగానే శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుండగా.. ప్రస్తుతం భారత క్రికెటర్లు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సాహా పుట్టినరోజు వేడుకలకి భారత క్రికెటర్లతో పాటు విరుష్క జోడీ కూడా హాజరైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు ఆడుతుండటంతో.. అతనితో కలిసి ఉండేందుకు ఇటీవల పాపతో కలిసి అతని భార్య అనుష్క శర్మ కూడా అక్కడికి వెళ్లింది. దాంతో.. సాహా కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో విరుష్క జోడీ సందడి ప్రముఖంగా కనిపించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇంగ్లాండ్‌తో ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌ని 3-1తో చేజిక్కించుకున్న టీమిండియా.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి కూడా అర్హత సాధించిన విషయం తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం బయో- సెక్యూర్ బబుల్‌లో ఉండి మ్యాచ్‌లు ఆడుతుండగా.. వారితో కలిసి ఉండాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా క్వారంటైన్, కరోనా వైరస్ పరీక్షల అనంతరమే బబుల్‌లోకి అనుమతిస్తున్నారు.






Untitled Document
Advertisements