ఏలూరులో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికలు!

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:16 PM

ఏలూరులో ఆగిపోయిన మున్సిపల్ ఎన్నికలు!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు నిలిపి వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు పరిధిలోని ఓటర్ల జాబితా అంశంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్నికలు ఆపేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. మరి కొద్దిసేపట్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. అలాగే రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై కూడా హైకోర్టు విచారణ జరిపింది. గతేడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బెదిరింపులు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని జనసేన పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్‌ విడుదలపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం తుది విచారణ జరిపి తీర్పును రిజర్వులో ఉంచింది.





Untitled Document
Advertisements