మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అన్నయ్య కన్నుమూత

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 07:01 PM

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ అన్నయ్య కన్నుమూత

దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ సోదరుడు ఏపీజే మహ్మద్ ముతు మీర మరైకయర్ కన్నమూశారు. తమిళనాడు, రామేశ్వరంలోని నివాసంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 104 ఏళ్ల మరైకయర్ గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయన మనవడు ఏపీజేఎంజే షేక్ సలీమ్ తెలిపారు.
ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో ఉంచారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అబ్దుల్ కలామ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్టీల్లో మరైకయర్ ఒకరు. మరైకయర్ గత ఏడాది ఫిబ్రవరి 5న కుటుంబ సభ్యుల సమక్షంలో 104వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అబ్దుల్ కలాం అవివాహితుడు కావడంతో... తన అన్న, ఇతర కుటుంబ సభ్యులను తరచుగా కలిసేవారు.
అబ్దుల్ కలాం సోదరుడి మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరైకయర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements