బంగారం ధర రానున్న రోజుల్లో పడిపోతుందా? పెరుగుతుందా?

     Written by : smtv Desk | Tue, Mar 09, 2021, 11:03 AM

బంగారం ధర రానున్న రోజుల్లో పడిపోతుందా? పెరుగుతుందా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాది ఆల్‌టైమ్ గరిష్టానికి చేరిన పసిడి ధర ఇప్పుడు భారీగా తగ్గింది. ఇంకా రేట్లు తగ్గొచ్చని కొంత మంది భావిస్తుంటారు. దీంతో చాలా మంది కొనుగోలు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉండొచ్చు.
బంగారం ధర 2020 ఆగస్ట్ నెలలో ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకింది. అక్కడి నుంచి చూస్తే పసిడి రేటు రూ.11,500 పతనమైంది. బిట్ కాయిన్, స్టాక్స్, బాండ్స్ వంటి వాటికి ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో బంగారం డల్ అయ్యిందని చెప్పుకోవచ్చు. దీంతో పసిడి రేటు పడిపోతూనే వచ్చింది.
పసిడి రేటు ఈ ఏడాది ఇప్పటికే రూ.5 వేలు దిగొచ్చింది. అయితే బంగారం ధర రానున్న రోజుల్లో ఇంకా పడిపోతుందా? లేదంటే పైకి కదులుతుందా? అనే అంశం ఇప్పుడు తెలుసుకోవాలి. బంగారం ధర మళ్లీ పైకి చేరొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. సమీప కాలంలో రూ.1000 పెరగొచ్చని చెబుతున్నారు.
అయితే అదేసమయంలో కొంత మంది నిపుణులు బంగారం ధర రానున్న రోజుల్లో రూ.41 వేల స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకొంత మంది నిపుణులు బంగారం ధర పెరగడం స్టార్ట్ అయితే మళ్లీ రూ.63 వేలకు చేరొచ్చని అభిప్రాపయడుతున్నారు. అందువల్ల బంగారం కొనాలనుకునే వారు తగ్గినప్పుడల్లా కొంటే మంచిదని చెపుకోవచ్చు.





Untitled Document
Advertisements