న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఇప్పుడు రూపాయికే విమానం టికెట్ లభించబోతుంది. అవాకయ్యారా..! అవునండి. దేశీయ తొలి బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్డెక్కన్ ఈ లక్కి ఆఫర్ ను అందిస్తోంది. 2012లో విమాన సర్వీసులను నిలిపి వేసిన ఎయిర్డెక్కన్ త్వరలోనే రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుందని జీ.ఆర్. గోపినాథ్ తెలిపారు. ఈ నెలాఖరులో ముంబయి, ఢిల్లీ, కోల్కతా, షిల్లాంగ్ నుంచి సమీపంలోని నగరాలకు విమానాలు నడపనున్నట్లు, జనవరి చివరి వరకు మిగతా చోట్ల కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న ఈ ఎయిర్డెక్కన్ విమానం డిసెంబర్ 22న ముంబయి నుంచి నాసిక్కు నడపనున్నారట. ఈ సందర్బంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ కన్నా తక్కువగా 40 నిమిషాల ప్రయాణానికి రూ.1400 ఛార్జీ చేయనున్నట్లు, ప్రయాణికులకు ఆకట్టుకోవడానికి రూ. 1 టికెట్ ఆఫర్ అందించనున్నట్లు ప్రకటించారు.