న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత విపణిలోకి ఇటలీ కార్ల సంస్థ మసెరాటీ సరికొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. 'క్వాట్రోపోర్టే జీటీఎస్' పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ ధర రూ.2.7 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఈ కారు 0-100 కి.మీ వేగాన్ని కేవలం 4.7 సెకన్లలో అందుకోగలదు. అంతేకాదు గరిష్ఠ వేగం గంటకు 310 కి.మీ కావడం దీని ప్రత్యేకత. 3.8 లీటర్ ట్విన్-టర్బో ఇంజిన్ కలిగిన క్వాట్రోపోర్టే , 6,500- 6,800 ఆర్పీఎంతో 530 హార్స్పవర్ ను అందిస్తోంది. ప్రస్తుతం మసెరాటీ భారత్లో క్వాట్రోపోర్టే, స్పోర్టీ సెడాన్ గిబ్లి, స్పోర్ట్స్ కార్లు గ్రాన్ టూరిస్మో, గ్రాన్కాబ్రియోలను విక్రయిస్తోంది.