ఎయిర్ టెల్ 4జీ హాట్‌స్పాట్‌పై ఆఫర్...

     Written by : smtv Desk | Wed, Dec 13, 2017, 04:03 PM

ఎయిర్ టెల్ 4జీ హాట్‌స్పాట్‌పై ఆఫర్...

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఎయిర్ టెల్, తన 4జీ హాట్‌స్పాట్‌ పోర్టబుల్‌ వై-ఫై డివైజ్‌ను వినియోగించుకునే యూజర్లకు కొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ.1500లకు లభించే ఈ డివైజ్ ఇకపై రూ. 999కే అందుబాటులోకి రానుంది. ఈ హాట్ స్పాట్ ద్వారా మల్టిపుల్‌ డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టాబ్లెట్లు, స్మార్ట్‌టీవీల వరకు హాట్ స్పాట్ సౌకర్యం కలిగి ఉంది. అమెజాన్‌ ఇండియా నుంచి కూడా కస్టమర్లు దీన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఇది రిలయన్స్‌ జియో అందిస్తున్న జియోఫై ఎం2ఎస్‌ 4జీ హాట్‌స్పాట్‌కు గట్టి పోటీగా ఉంది.





Untitled Document
Advertisements