న్యూఢిల్లీ, డిసెంబర్ 13: విమాన ప్రయాణికులకు శుభవార్త. అదేంటంటే.. ఇకపై విమానాలలో వైఫై సేవలను అందించనున్నరట. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు ట్రాయ్ ఈ సిఫార్సులు చేస్తుండడం విశేషం. ప్రస్తుతం నూతన టెలికాం విధానానికి సంబంధించి ట్రాయ్ పనిచేస్తోంది. ఇందులో లైసెన్సింగ్, మౌలిక సదుపాయాలు, బ్రాడ్బ్యాండ్, ఇతరాలకు సంబంధించి నాలుగు గ్రూపులు పనిచేస్తున్నాయి. కాగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ మాట్లాడుతూ... ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై పనిచేస్తున్నామని, రాబోయే 15 రోజుల్లో దీనికి సంబంధించిన సిఫార్సులను అందజేయనున్నామని తెలిపారు.